Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరగడానికి జైళ్లో కావాలనే మామిడి పళ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ ఆరోపించింది. తన షుగర్ లెవల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలని, తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు గురువారం విచారణ జరిపింది.