Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్​ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత సమస్య ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కేరళలో.. నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో పడిపోయాయని.. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ సీడబ్ల్యూసీ చెప్పింది. ప్రస్తుతం రిజర్వాయర్ల కెపాసిటీలో సగటున 17శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది.