గత 12 సంవత్సరాలుగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్నానని, ఐదు సార్లు ఇంటర్య్యూకు హాజరయ్యానని, అయినా, సర్వీస్ రాలేదని ఒక సివిల్స్ అభ్యర్థి ‘ఎక్స్’ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అతనిని ఓదారుస్తూ నెటిజన్లు పలు కామెంట్స్ చేశారు.