2017లోనే పిటిషన్ వేశా- ఆళ్ల రామకృష్ణా రెడ్డి

2015 ఓటుకు నోటు కేసు(Note For Vote)లో టీడీపీ అధినేత చంద్రబాబును(Chandrababu) ముద్దాయిగా చేర్చాలని తాను 2017 సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy)తెలిపారు. అలాగే ఈ కేసు దర్యాప్తును సీబీఐ(CBI)కి అప్పగించాలని పిటిషన్‌లో కోరానని తెలిపారు. ఈ కేసు గత విచారణలో వివిధ కారణాలతో చంద్రబాబు తరఫు న్యాయవాది వాయిదా కోరారన్నారు. రేపు సుప్రీంకోర్టు(Supreme Court) ఈ కేసు విచారణ జరగబోతుందని తెలిపారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నా ఏడేళ్లుగా విచారణ జరగలేదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడంలేదని, అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తును అప్పగించాలని కోర్టును కోరానన్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మత్తయ్య, సెబాస్టియన్ కూడా ఓటుకు నోటు కేసుపై సుప్రీంను ఆశ్రయించారన్నారు. మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు.