“ఆట కోసం, ఐపీఎల్ కోసం, అభిమానుల కోసం, ప్లేయర్స్ కోసమైనా సరే ఆర్సీబీని కొత్త యజమానికి అమ్మే ప్రయత్నం బీసీసీఐ చేయాలి. ఇతర టీమ్స్ లాగే ఓ స్పోర్ట్స్ ఫ్రాంఛైజీని నిర్మించగలిగే వారికి జట్టును అప్పగించాలి” అని మహేష్ భూపతి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జట్టుపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఇలా ఏకంగా ఇప్పుడున్న యజమాని నుంచి మరో యజమానికి జట్టును అప్పగించేలా చూడాలని కోరడం మాత్రం ఇదే తొలిసారి.