అయోధ్య రాముడి కోసం హైదరబాద్ నుంచి భారీ లడ్డు వెళ్తోంది. కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 12 వందల 65 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. ఈ లడ్డుకు ఇవాళ శోభయాత్ర ప్రారంభించారు. ఆలయ నిర్మాణం నుంచి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగానే నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువుతో లడ్డు తయారు చేయించారు.
Laddu for Ayodhya | రాముడిపై క్యాటరింగ్ యజమాని భక్తి.. అయోధ్యకు 1265 కిలోల లడ్డు
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.