అయోధ్య రాముడి కోసం హైదరబాద్ నుంచి భారీ లడ్డు వెళ్తోంది. కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 12 వందల 65 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. ఈ లడ్డుకు ఇవాళ శోభయాత్ర ప్రారంభించారు. ఆలయ నిర్మాణం నుంచి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగానే నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువుతో లడ్డు తయారు చేయించారు.