రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ PS పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె తల నరికేశాడు. పక్కా పథకం ప్రకారం భర్త మర్డర్ ప్లాన్ చేసి, ఈ దురాగతానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వినయ్ అనే వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం ఉంది. ఈ క్రమంలోనే ఆమెని అంతమెుందించాలని ప్లాన్ వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.