Site icon janavahinitv

Laddu for Ayodhya | రాముడిపై క్యాటరింగ్ యజమాని భక్తి.. అయోధ్యకు 1265 కిలోల లడ్డు

అయోధ్య రాముడి కోసం హైదరబాద్ నుంచి భారీ లడ్డు వెళ్తోంది. కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 12 వందల 65 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. ఈ లడ్డుకు ఇవాళ శోభయాత్ర ప్రారంభించారు. ఆలయ నిర్మాణం నుంచి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగానే నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువుతో లడ్డు తయారు చేయించారు.

Exit mobile version