విద్యార్థుల ఇష్టం..

కాగా, సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘‘ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండు పరీక్షలలో వారు ఉత్తమ స్కోరును ఎంచుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఐచ్ఛికం, బలవంతం కాదు’’ అని వివరించారు.