TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను(TS Inter Results 2024) విద్యాశాఖ అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫెయిల్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్(TS Inter Supplementary Exams) ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఇంటర్ బోర్డు(Telangana Inter Board) అధికారులు సూచించారు. అలాగే తక్కువ మార్కులు వచ్చినట్లు భావిస్తే విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలను(Advanced Supplementary Exams) మే 24 వరకు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రీకౌంటింగ్(Recounting), రీవాల్యూయేషన్ (Revaluation)కు సబ్జెక్టు వారీగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే!-hyderabad ts inter results 2024 released ts supplementary exam schedule recounting revaluation details ,తెలంగాణ న్యూస్
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…