కాసేపట్లో పెళ్లి జరగబోయే కళ్యాణ మండపం బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో కలకలలాడుతోంది. ఇంతలోనే సడన్‌గా కొంతమంది వ్యక్తులు కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ఎంట్రీ ఇచ్చారు. క్రమంలో వరుడికి గాయాలయ్యాయి. అమ్మాయిని ఆమె బంధువులు తీసుకెళ్లడం జరిగిపోయింది. సినిమా స్టయిల్‌లో జరిగిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ ఘటన జరిగింది. ఘటనలో అసలు విషయాన్ని పెళ్లికూతురు వెల్లడించింది.