ఆదిలాబాద్ జన జాతర మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇక్కడ ఉన్న కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే 6 గ్యారంటీలో ఐదు నెరవేర్చమని రేవంత్ రెడ్డి తెలిపారు.