జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండు సెషన్లలో కలిపి 24 లక్షలకు పైగా ఉంది. సెషన్ 1లో 12,21,624 మంది, సెషన్ 2 లో 12.57 లక్షల మంది రిజిస్టర్​ చేసుకున్నరు. ఎన్టీఏ డేటా ప్రకారం.. సెషన్ 1 లో 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణ అత్యధికంగా ఏడుగురు అభ్యర్థులతో 100 పర్సంటైల్ హోల్డర్లను నమోదు చేసింది. తరువాత ఆంధ్ర నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.