ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత వేడిగా సాగుతోంది. నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. పదవుల కోసం నా కాళ్లు పట్టుకుంది మరిచిపోయావా పెద్దిరెడ్డి అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.