PBKS vs MI Live: ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. మొహాలీలోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో అత్యధిక స్కోరు సాధించడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతోపాటు తిలక్ వర్మ, రోహిత్ శర్మ మెరుపులతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.