ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)ను ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిపై పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ కడపకు చెందిన  వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా షర్మిల, సునీత,చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తో పాటు రవీంద్ర నాథ్ రెడ్డి పేరును చేర్చారు. వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో ప్రస్తావించారు. దీనిపై విచారించిన కడప కోర్టు…..వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.