అయోధ్యలో బాల రాముడి శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.కొత్త రామాలయంలో తొలి రామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రాముడి భక్తులు అయోధ్యకు చేరుకొని, స్వామి సేవలో తరిస్తున్నారు.