Hyderabad Metro Rail : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం రాత్రి 12:15 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రో రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ప్రతీ మెట్రో రైలు, మెట్రో స్టేషన్ లలో మెట్రో భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.మెట్రో స్టేషన్ లోకి మద్యం సేవించి రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు ఎవరైనా వేస్తే ట్రైన్ ఎక్కేందుకు భద్రతా సిబ్బంది అనుమతించరని తెలియచేశారు. మెట్రో పరిధిలో ఎవరితో దుర్బాషలాడినా, ఎవరినైనా వేధించిన కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ప్రయాణికులను హెచ్చరించారు. ప్రయాణికులు అంతా బాధ్యతగా వ్యవహరించి మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు- అర్ధరాత్రి వరకూ మెట్రో రైలు సర్వీసులు పొడిగింపు-hyderabad news in telugu new year celebrations metro rail service extended up to midnight on december 31st ,తెలంగాణ న్యూస్
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…