- తిరుపతి రెడ్డితో కౌన్సిలర్ల భేటీ
- వార్డు సమస్యలపై తిరుపతి రెడ్డితో చర్చించిన సాయిపూర్ కౌన్సిలర్లు
- ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ముఖ్యమంత్రి సోదరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డిని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తాండూరు మున్సిపాలిటీ సాయి పూర్ కు చెందిన 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు ఉన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు తిరుపతి రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తాండూరు పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.



