ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవటంతో పలుచోట్లు ఆ పార్టీల నాయకుల్లో అసంతృప్తి తీవ్రంగా నెలకొని ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవటంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే TDPలోని పలువురు సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీరు పెట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమక్షంలో ఆమె కన్నీటిని దాచుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉన్నానని, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో శ్రమించానని అన్నారు.
Tirupati Assembly Seat | మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.