ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవటంతో పలుచోట్లు ఆ పార్టీల నాయకుల్లో అసంతృప్తి తీవ్రంగా నెలకొని ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవటంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే TDPలోని పలువురు సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీరు పెట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమక్షంలో ఆమె కన్నీటిని దాచుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉన్నానని, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో శ్రమించానని అన్నారు.