21.1 C
New York
Sunday, May 19, 2024

Buy now

Tirupati Assembly Seat | మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవటంతో పలుచోట్లు ఆ పార్టీల నాయకుల్లో అసంతృప్తి తీవ్రంగా నెలకొని ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవటంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే TDPలోని పలువురు సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీరు పెట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమక్షంలో ఆమె కన్నీటిని దాచుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉన్నానని, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో శ్రమించానని అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles