సామజిక స్పృహ ఉన్న పారిశ్రామికవేత్త…..

ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో, పార్టీ నాయకత్వం బీబీ పాటిల్ ని పక్కకు పెట్టి, సామజిక స్పృహ ఉన్న సుభాష్ రెడ్డి లాంటి వారిని అభ్యర్థిగా నిలిపితే పార్టీకి అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాను జహీరాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా సామజిక కార్యక్రమాలు చేపట్టడం వలన, పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటాయని సుభాష్ రెడ్డి కూడా చెబుతున్నట్లు తెలిసింది. బీబీ పాటిల్ దగ్గర ఉన్న బీఆర్ఎస్ నాయకులూ మాత్రం… చంద్రశేఖర్ రావు మల్లి తమ నేతకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కామారెడ్డి నియోజకవర్గంలో, బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలవగా, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి.