CM Revanth Reddy : నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై చర్చించారు. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ అంగీకరించింది. రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను సీఎం నీతి ఆయోగ్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి తమ వంతుగా సహకారమందిస్తామన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికిచ్చే నిధులు, వనరుల మంజూరు గురించి చర్చించారు.