Rathnam Twitter Review In Telugu: యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కింది రత్నం. ఇది వరకే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.

రత్నం సినిమాపై

రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎటువైపో ఎటువైపో.. అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడంది.

కుటుంబ సమేతంగా

ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మేరకు సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కొనియాడారు.

సోషల్ మీడియాలో

ఈ చిత్రం ఏప్రిల్ 26న అంటే ఇవాళ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పడిన పలు ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ రత్నం మూవీపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రత్నంపై రివ్యూలు ఇస్తున్నారు. మరి వారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం.

కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్

“షోటైమ్ రత్నం. విశాల్ నుంచి బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ సినిమా రత్నం” అని రాఘవ్ అనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) యూజర్ ట్వీట్ చేశఆడు. అందులో థియేటర్‌లోని విజువల్స్‌ వీడియోను షేర్ చేశాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్‌ రావడంతో ఆ వీడియో ఉంది.