ప్రయోగాత్మకంగా అమలు..

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రమైన వేడి కారణంగా డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తరచూ మూర్ఛపోవడానికి దారితీస్తుంది. ఏసీ హెల్మెట్లు వారి అవిశ్రాంత సేవలకు కొంత ఊరటను ఇస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ ఏసీ హెల్మెట్లను వినియోగిస్తున్నామని, నగరంలోని ఆరు కూడళ్లలో పోలీసు అధికారులకు ఇచ్చామని వడోదర ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. వడోదరాలోనే కాదు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కూడా ట్రాఫిక్ పోలీసుల కోసం ఇటీవల ఏసీ హెల్మెట్లను ప్రవేశపెట్టారు. ఈ ఆలోచనను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులకు కూడా అమలు చేయాలని పలువురు భావిస్తున్నారు.