శని దోషం పోగొట్టేందుకు

హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఆరాధించాలి. ఆంజనేయస్వామి ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పురాణాల ప్రకారం శని పట్టని వారిలో హనుమంతుడు ఒకరు. అందుకే ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా పొందినట్టే. శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది.