పంచారామాల టూర్ షెడ్యూల్ :

  • పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలను చూసేందుకు పంచారామాల టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
  • హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • నాన్ ఏసీ హైటెక్ కోచ్ బస్సులో జర్నీ చేస్తారు.
  • పెద్దలకు రూ.4999, పిల్లలకు రూ. 3999గా టికెట్ ధరలు ఉన్నాయి.
  • ఇందులో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షరామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శిస్తారు
  • DAY-1 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు.
  • DAY-2 – ఉదయం 5 గంటలకు అమరావతికి చేరుకుంటారు. ఇక్కడ్నుంచి Palakollu, Bhimavaram, Draksharamam, Samarlakotaకు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • DAY-3 – ఉదయం 07.00 AMకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Telangana Tourism Shirdi Tour 2024: షిర్డీకి(Shirdi) వెళ్లే ప్లాన్ ఉందా…? ఎలాంటి ఇబ్బంది లేకుండా, తొందరగా వెళ్లి రావాలనుకునే వారికోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism S). హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 2 రోజుల్లోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….