గత నెలలో కూడా..

గత నెలలో థానే జిల్లాలో జరిగిన షేర్ ట్రేడింగ్ కుంభకోణాన్ని నవీ ముంబై సైబర్ పోలీసులు ఛేదించారు. మీరా రోడ్డులో నిందితుడు పీయూష్ జవారిలాల్ లోధా (39)ను అరెస్టు చేసిన పోలీసులు, అతడి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, వివిధ బ్యాంకులకు సంబంధించిన తొమ్మిది ఏటీఎం కార్డులు, రెండు చెక్ బుక్స్, రెండు పాన్ కార్డులు, నాలుగు రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం జనవరి 18 నుంచి ఫిబ్రవరి 29 వరకు తనను రూ.29 లక్షలకు మోసం చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా వేలాది మందిని రూ.64 కోట్లకు పైగా మోసం చేసిన ఇద్దరు మోసగాళ్లను కూడా గురుగ్రామ్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు ల్యాప్ టాప్ లు, 41 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ప్రియాన్షు దివాన్ తెలిపారు. సిమ్ కార్డుల ద్వారా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) డేటాను పరిశీలించిన తర్వాత వారు దేశవ్యాప్తంగా సుమారు రూ.64.85 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. నిందితులను పింకీ, వికార్, ప్రకాశ్, ధర్మేందర్, సూరజ్, పూజగా గుర్తించారు.