ఏపీలో ఎన్నికల వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడపలో ఇవాళ బస్సు యాత్రను మెుదలు పెట్టిన షర్మిల.. తాను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. బాబాయ్ ని చంపిన అవినాష్ రెడ్డి వైపు ఉంటారో, న్యాయం వైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని షర్మిల అన్నారు. తాను జగనన్నకు వ్యతిరేకం కాదని, హంతకులకు టికెట్ ఇచ్చారని ఆమె మండిపడ్డారు.