వైసీపీ అధినేత జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో తీవ్రంగా నష్టపోయామని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి అపర్ణ వన్ అపార్ట్మెంట్స్ లో మంగళగిరికి నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభిమానులు సమావేశం అయ్యారు. ఇందులో ఆళ్ల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో SFT రూ.5500 ఉండేదని, ఇప్పుడు తమ అపర్ణ అపార్ట్మెంట్లో రూ. 3300కి కొనే నాధుడు లేడని వాపోయారు.