మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌, ప్ర‌ధాని మోదీతో చ‌ర్చ‌లో పాల్గొన్నారు. మోదీ నివాసంలో ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, కరోనా వైరల్ వ్యాక్సిన్, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌లో భార‌తీయ‌ల‌ను బిల్ గేట్స్ ప్ర‌శంసించారు. సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకెళ్తున్న‌ట్లు కూడా గేట్స్ తెలిపారు. పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్ష‌న్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్ర‌ధాని సెల్ఫీ దిగారు.