అంతేకాదు ఓపెనర్ గా వచ్చిన కోహ్లి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. 59 బంతుల్లో 83 రన్స్ చేశాడు కోహ్లి. అతని పోరాటంతోనే ఆర్సీబీ 182 పరుగులు భారీ స్కోరు చేయగలిగింది. డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి ప్లేయర్స్ జట్టులో ఉన్నా.. ఈ ముగ్గురూ తొలి మూడు మ్యాచ్ లలో విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్ భారమంతా కోహ్లిపైనే పడుతోంది. చివర్లో కార్తీక్ మెరుపులు ఆ టీమ్ కు కాస్త కలిసి వస్తున్నాయి.