అనంతపురం జిల్లా శింగనమలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. శింగనమలలో ఈ సారి పసుపు జెండా ఎగరేయబోతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం అని స్పష్టం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు ప్రజలను కోరారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోయారని విమర్శించారు. టీడీపీ వెన్నెముక బీసీలన్న చంద్రబాబు.. భవిష్యత్తులోనూ వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పారు.