ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. తూర్పు గోదావరి జిల్లా రామవరంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ టీడీపీ జెండాలు, పార్టీ గుర్తు సైకిల్ ను కార్యకర్తలు దగ్ధం చేశారు. అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించటంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నల్లమిల్లి అనపర్తి నుండి రెబల్ గా పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.