ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. తూర్పు గోదావరి జిల్లా రామవరంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ టీడీపీ జెండాలు, పార్టీ గుర్తు సైకిల్ ను కార్యకర్తలు దగ్ధం చేశారు. అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించటంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నల్లమిల్లి అనపర్తి నుండి రెబల్ గా పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Anaparthi: అనపర్తిలో భగ్గుమన్న టీడీపీ వర్గం.. జెండాలు, సైకిల్ దగ్ధం చేసి నిరసన
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.