అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ప్రజాగళం సభలో వైసీపీపై తీవ్రస్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదన్న చంద్రబాబు.. కరెంట్ ఛార్జీలు తగ్గించారా అని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. ఐదేళ్లలో అనేక అరాచకాలు జగన్ ప్రభుత్వం చేసిందని, వ్యవస్థల్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.