Cash From Washing Machine : దేశవ్యాప్తంగా పలు షిప్పింగ్ కంపెనీల(Shipping Companies) కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు (ED Raids)చేసింది. ఈడీ తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. ఈ సోదాల్లో వాషింగ్ మెషీన్ లో భారీగా నగదు(Cash From Washing Machine) దొరకడం కొసమెరుపు. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణల కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్, దాని డైరకర్లు, అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 2.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగదులో కొంత భాగాన్ని వాషింగ్ మెషీన్లో దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్ కంపెనీ, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, లక్ష్మీటన్ మారిటైమ్, హిందూస్తాన్ ఇంటర్నేషనల్, రాజ్నందిని మెటల్స్ లిమిటెడ్, స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా, భాగ్యనగర్ స్టీల్స్, వినాయక్ స్టీల్స్, వశిష్ట కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంస్థల డైరెక్టర్లు, భాగస్వాములు సందీప్ గార్గ్, వినోద్ కేడియా, ఇతరుల ఇళ్లు, కార్యాలయ్యాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ సంస్థల కార్యాలయాలు ఉన్న దిల్లీ, హైదరాబాద్, ముంబయి, కురుక్షేత్ర, కోల్కతాలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
వాషింగ్ మెషీన్ లో నోట్ల కట్టలు-ఈడీ అధికారులు షాక్!-hyderabad ed searches shipping companies found cash from washing machine seized 2 54 crore ,తెలంగాణ న్యూస్
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…