తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం ఆఫ్‌లైన్ టికెట్ల బుకింగ్

తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం ఆఫ్‌లైన్ టికెట్ల సదుపాయాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. అయితే ఉచిత దర్శనం(Free Darshan) లేదా సర్వ దర్శనం టికెట్లను మాత్రమే ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు(Tirumala Special Darshan Tickets), దివ్య దర్శనం, ఆర్జీత సేవల టికెట్లు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో లేవని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు తెలిపింది.