ఇక ఢిల్లీ 7 సార్లు, బరోడా 5, మధ్యప్రదేశ్ 5 సార్లు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలిచాయి. ఇప్పుడు ముంబై చేతుల్లో ఫైనల్లో ఓడిన విదర్భ గతంలో రెండుసార్లు రంజీ ట్రోఫీ గెలిచింది. తమిళనాడు, సౌరాష్ట్ర, రాజస్థాన్, రైల్వేస్, మహారాష్ట్ర, హైదరాబాద్ కూడా రెండేసిసార్లు ఈ ట్రోఫీ గెలిచాయి. బెంగాల్ మూడుసార్లు విజేతగా నిలిచింది.