ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ భారీగా నష్టపోవడం ఖాయమంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి కొడాలీ నాని తీవ్రంగా స్పందించారు. పీకే ఓ తీసేసిన తహసీల్దార్ అని, అతను ఇప్పుడు ఏ పార్టీకి పనిచేయడం లేదన్నారు. కేవలం జాతకాలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని మాజీ CM చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.