18.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

Revanth Vs Kavitha | బడే మియా చేసిన అన్యాయంపై చోటే మియా ఎందుకు నోరు విప్పలే..?

గుజరాత్ మాదిరిగా తెలంగాణ అభివృద్ది చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని సీఎం అనుముల రేవంత్ రెడ్డి కోరారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ లో పర్యటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రూ. 56 వేల కోట్ల విలువైన పనులకు మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. మోదీ పెద్దన్నయ్య అయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎందుకు అన్యాయం చేసినట్లు..? బడే మియా చేసిన అన్యాయంపై చోటే మియా ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. వీరిద్దరూ ఒక్కటే అని మేం చెప్తున్న మాటలు ఈరోజు నిజమయ్యాయి కదా అని కవిత అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles