Uma Bharti: అయోధ్య లో నిర్మించిన తరహాలోనే కాశీలో, మథురలో ఆలయాలు నిర్మించాలని, తద్వారా అయోధ్య మాదిరిగానే కాశీ, మథురలకు కూడా తమకు దక్కాల్సిన హక్కులు లభిస్తాయని బీజేపీ నాయకురాలు ఉమాభారతి డిమాండ్ చేశారు. అయోధ్యలో సాక్ష్యాధారాలను తవ్వకాలు జరిపి సాధించాల్సి వచ్చినందువల్ల ఆందోళనలు చెలరేగాయని, అయితే, కాశీ, మథురలో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదని ఆమె వివరించారు. కాశి, మథురల్లో అన్ని ఆధారాలు కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు.