Kamareddy Crime : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి లక్ష్మీపతి (55) బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులకు, తెలిసిన వారికి అడిగిన ఆచూకీ తెలియలేదు. దీంతో గ్రామంలో, గ్రామ పరిసర ప్రాంతంలో వెతుకుతున్న సమయంలో సొంత పొలం వద్ద చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. లక్ష్మీపతి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కొండ విజయ్ తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డిలో విషాదం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య-kamareddy crime news in telugu farmers committed suicide due debt issues ,తెలంగాణ న్యూస్
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…