Tirupati Ooty Tour Ticket Prices: తిరుపతి – ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26,770ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 15,880 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. గతేడాదిలో ఇదే టూర్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ కు రూ. 29వేలుగా ఉండగా.. డబుల్ షేరింగ్ రూ. 17వేలుగా ఉండేది. ఈ కొత్త ఏడాదిలో కాస్త ధరలు తగ్గాయి. సమ్మర్ వస్తే మళ్లీ ధరలు పెరగనున్నాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.