తక్షణమే పేఅబ్రిడేషన్ అమలు చేయాలి...!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

సింగరేణిలో అధికారులకు తక్షణమే కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పేఅబ్రిడేషన్ అమలు చేయాలి.

గత రెండు సంవత్సరాల ప్రొడక్షన్ రిలేటెడ్ పే పిఆర్పి వెంటనే విడుదల చేయాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జనవాహిణి ప్రతినిధి

మణుగూరు:- అఖిలభారత బొగ్గు గనులు అధికారుల సంఘం సింగరేణిలో అధికారులకు తక్షణమే కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పేఅబ్రిడేషన్ అమలు చేయాలని మరియు గత రెండు సంవత్సరాల ప్రొడక్షన్ రిలేటెడ్ పే పిఆర్పి వెంటనే విడుదల చేయాలని అఖిల భారత బొగ్గు గనులు ఆఫీసర్స్ అసోసియేషన్ మణుగూరు అధికారుల సంఘం తరపున మణుగూరు లోని అధికారులు రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభించబడింది. ఈ రిలే నిరాహార దీక్షలు ఈనెల 13 వరకు కూడా కొనసాగుతాయని మరియు యాజమాన్యం స్పందించకపోతే తీవ్రమైన పోరాటాలకు వెనకాడ మని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారుల సంఘం ముఖ్య కార్యదర్శి శ్రీ మదన్ నాయక్, శ్రీ రమణారెడ్డి, రామ్ శంకర్, శోభన్ బాబు సాయిల సురేష్ కుమార్, సర్వర్ నభి, కిషన్ రామ్, తోలం మధుసూదన్, డి. రమేష్ బాబు, సుదర్శన్ రెడ్డి, సీతారాం బాబు, జె. శ్రీనివాసరావు, నరసింహారావు, కృష్ణమూర్తి తదితరులు మొదటిరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *