చిత్తూరు జిల్లా వాసులకు ఏనుగుల బెడద తప్పటం లేదు. పంట పొలాలు, గ్రామాలపై దాడులకు దిగుతున్నాయి. పంట పొలాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా పులిచెర్ల మండలం కూనపల్లికి ఏనుగుల గుంపు వచ్చింది. పల్లెకి ఆనుకొని ఉన్న పొలాల్లో తిరుగుతున్నాయి. కొబ్బరి చెట్లను నాశనం చేశాయి. వాటిని తరిమేందుకు వెళ్లిన జనంపై గజరాలు తిరగ బడ్డాయి.