నాస్తిక ప్రచారకర్త బైరి నరేష్ కారు అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టడంతో ఉద్రిక్తతతకు దారితీసింది. ఘటన ఏటూరునాగారంలో సోమవారం జరిగింది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాస్తికుడు నరేష్ హాజరయ్యారు. గతంలో నరేష్ అయ్యప్పస్వామిని, ఆయన భక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అయితే నరేష్ ఏటూరునాగారం వచ్చిన విషయం తెలుసుకున్న అయ్యప్పస్వాములు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఇక్కడికి ఎందుకొచ్చావంటూ నిలదీసి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అయ్యప్పస్వాములు, బైరి నరేశ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తన కారులో నరేష్ వెళ్తుండగా పోగు నర్సింగారావు అనే భక్తుడిని నరేష్ కారు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ బైరి నరేష్ను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.