CM జగన్ చెప్పినట్లు పని చేస్తే తన మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుందని వైసీపీ ఎమ్మెల్యే ఎమ్ఎస్ బాబు ప్రశ్నించారు. వైసీపీ కేవలం దళిత ఎమ్మెల్యేల మీదనే ప్రజల్లో వ్యతిరేకత ఉందా అని అడిగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఉన్న ఎమ్ఎస్ బాబు తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.