ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సవాళ్ల పర్వం పెరుగుతోంది.దీనికితోడు వ్యక్తిగత విమర్శలు చేసుకొని దమ్ము ధైర్యం ఉంటే సవాల్ కు రావాలని ఇరువురు సవాళ్లు చేసుకున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు రంగంలోకిదిగి భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.