విశాఖ రుషికొండలో కట్టిన నిర్మాణాల ప్రారంభోత్సవం అంత నిర్బంధంగా ఎందుకు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రశ్నించారు. గురువారం విశాఖలో పర్యటించిన కేఏపాల్, రుషికొండ మార్గంలో వెళ్తుండగా పోలీసులు అడ్డగించి ఆపేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కేఏపాల్.. పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. రుషికొండలో ఏమైన నరబలి జరుగుతుందా అని ప్రశ్నించారు. మీడియాని ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు ఏ సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కి కేఏపాల్ వార్నింగ్ ఇచ్చారు.