ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పామర్రులో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల చేసేందుకు పామర్రులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే సీఎం పామర్రుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా సభాస్థలికి వచ్చారు. అనంతరం సభపై ఓ విద్యార్థిని చేసిన ప్రసంగాన్ని విని సీఎం జగన్ మెచ్చుకున్నారు.